Business

TollyWood

Breaking News

Technology

BollyWood

Read more ...


Read more ...

ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్ ఇచ్చిన శ్రీదేవి



అతిలోక సుందరిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన హీరోయిన్ శ్రీదేవి. ఇదిలా ఉంటే శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ సైతం బాక్సాపీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అంతే కాకుండా తను ఆశించినన దానికంటే సెకండ్ ఇన్నింగ్ లో మరింత రెస్పాన్స్ రావడంతో, శ్రీదేవి ఫుల్ జోష్ లో ఉంది. అయితే తాజాగా శ్రీదేవి తీసుకున్న నిర్ణయంతో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా షాక్ అయింది. ఇదంతా తను నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో జరిగింది. 
                                       అందాల కథానాయిక శ్రీదేవి ఇప్పుడు బబ్లీ హీరోయిన్ హన్సికకు తల్లిగా నటిస్తోంది. విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ సినిమాలో ఈ ముచ్చట చోటు చేసుకుంటోంది. అయితే ఈ మూవీలో శ్రీదేవి నటించేందుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో రాకుమార్తెగా హన్సిక నటిస్తుండగా, మహారాణి పాత్రలో శ్రీదేవి నటిస్తుంది. కాగా, ఈ సినిమా కోసం చెన్నయ్ బీచ్ రోడ్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో రాజసౌధం సెట్టును భారీ వ్యయంతో నిర్మించారు. 
                                         ఈ సెట్లో ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో విజయ్ సరసన మరో కథానాయికగా శృతి హాసన్ సైతం నటిస్తోంది. మహారాణి పాత్రలో శ్రీదేవి రూపం అత్యద్భుతం అని అంటున్నారు. ఈ మూవీలో శ్రీదేవి నటించేందుకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందని చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొదటగా ఈ పాత్రలో శ్రీదేవి నటించేందుకు అంగీకరించలేదు. తరువాత కథ విన్న తరువాత, కథలోని తన పాత్ర ప్రాముఖ్యతను డైరెక్టర్ వివరించాక, అప్పుడు అంగీకరించిందట.
Read more ...

జూనియర్ కు విలన్ గా మారిన క్రికెటర్ !



పూరిజగన్నాథ్, జూనియర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో జూనియర్ కు విలన్ గా ఒక ప్రముఖ క్రికెటర్ నటించబోతున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలం క్రితం మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భాగ్యనగరం వచ్చి దర్శకుడు పూరీని కలిసి ఏకాంతంగా చర్చించడమే కాకుండా అవకాశాలు కలిసి వస్తే తాను సినిమాలలో నటిస్తాను అని బహిరంగంగానే మీడియాకు లీక్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు శ్రీశాంత్.  ఈ విషయం అక్కడితో ముగిసి పోయింది అని అనుకున్నారు అంతా. 
                                      అయితే తిరిగి శ్రీశాంత్ ప్రస్తావన గత కొద్ది రోజులుగా ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. దీనికి కారణం పూరి దర్శకత్వం వహిస్తున్న జూనియర్ సినిమాలో ఒక డిఫరెంట్ విలన్ పాత్రను పూరి శ్రీశాంత్ కోసం డిజైన్ చేసాడు అని టాక్.  ఈ ఆలోచన జూనియర్ కు కూడా నచ్చడంతో శ్రీశాంత్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం పై త్వరలోనే అధికారక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. 
                                    ఒక వైపు బండ్ల గణేష్ ఆర్ధిక సమస్యల వల్ల ఈ మధ్యనే జరిగిన గోవా షెడ్యూల్ ఖర్చులు అన్నీ జూనియర్, పూరీలు భరించారు అని గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అనుకోకుండా ఈ కొత్త విలన్ పాత్రలో శ్రీశాంత్ వార్తల హడావిడి ఏమిటని టాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులు ఆశ్చర్యపోతున్నట్లు టాక్...
Read more ...

రోబో-2 హీరో మారాడు, రజనీకాంత్ కాదు!



హైదరాబాద్: ప్రముఖ సౌతిండియా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘రోబో' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ నటించడంతో ఈచిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. త్వరలో చిత్రానికి సీక్వెల్‘రోబో-2' కూడా రాబోతోంది. అయితే సీక్వెల్ లో రజనీకాంత్ కాకుండా మరొకరు నటిస్తారని తెలుస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. 
                             అందుకు దర్శకుడు శంకర్ కూడా సుముఖత వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే స్టోరీ కూడా సిద్ధం చేశాడు. భారీ యాక్షన్ సినిమాను మళ్లీ చేయడానికి తన ఆరోగ్యం సహకరించదని రజనీకాంత్ చెప్పడంతో , మరో హీరో కోసం రిలయన్స్ సంస్థ అన్వేషణ చేస్తోంది. అయితే ‘రోబో-2' ఎవరితో ఉంటుందనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రానప్పటికీ.....తమిళ హీరో విజయ్ వైపు రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 
                              ఏది ఏమైనా శంకర్ నిర్ణయంపైనే రోబో-2 చిత్రం ఆధారపడి ఉంటుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం శంకర్ ‘ఐ' సినిమా విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు విజయ్ ‘కత్తి' సినిమాతో హిట్టు కొట్టి త్వరలో శింబుదేవన్ దర్శకత్వంలో భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ పనులు పూర్తయ్యాక.....2015 ద్వితీయార్థంలో ‘రోబో-2' చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read more ...

ఒకే వేదిక మీద కనిపించనున్న బాలయ్య , ఎన్టిఆర్ ?




Read more ...
Designed By Blogger Templates